ఖమ్మం జిల్లా వైరాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఆసుపత్రిని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ యువకుడు బస్టాండ్ సమీపంలో ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అమాయకులను మోసం చేస్తూ వచ్చిరాని వైద్యం చేస్తున్నాడని, అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్నాడని మండల వైద్యాధికారి శశిధర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఆ వైద్యశాలను తనిఖీ చేయగా అతడి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఆ విషయాన్ని వైద్యాధికారి డీఎంహెచ్వోకు సమాచారం ఇచ్చాడు. జిల్లా వైద్యాధికారి మాలతి ఆదేశాల మేరకు ఆసుపత్రిని సీజ్ చేశారు. అనుమతి లేకుండా బోర్డులు ఏర్పాటు చేసినా, చికిత్సలు చేసినా చట్ట విరుద్ధమని, కఠిన చర్యలు చేపడతామని డీఎంహెచ్వో హెచ్చరించారు.
ఇవీ చూడండి: వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలి: డీకే అరుణ