కరీంనగర్ గ్రామీణ జిల్లా నగునూరు గ్రామానికి చెందిన మల్లయ్య, అదే గ్రామానికి చెందిన రాకేష్, భిక్షపతి భూ తగాదాలతో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అడ్డువచ్చిన మల్లయ్య భార్యను కూడా కర్రలతో చితకబాదారు.
కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య భూమి విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. వాగ్వాదాలు ఒక్కసారిగా పెరిగి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు