కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గ్రామంలో కొత్త రాతి యుగం అవశేషాలు బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నాటి రాతి గొడ్డళ్లను ఈ గ్రామంలోని బీరప్ప ఆలయంలో పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్థానికులు అనేక సంవత్సరాల నుంచి రాతి విగ్రహాలను పూజిస్తున్నారు.
రెండు రోజుల క్రితం పొలం దున్నుతుండగా... వర్ధమాన మహావీరుని దిగంబర విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటిదిగా అధికారులు భావిస్తున్నారు. చారిత్రిక అవశేషాలు బయట పడటం వల్ల ఈ గ్రామంలో వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి