కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు సబ్ స్టేషన్ను ముట్టడించారు. తమ బాధను లైన్మెన్తో చెప్పుకోగా పట్టనట్లు వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సత్వరమే పర్యవేక్షించి విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: సీఎంవో ఉద్యోగినంటూ మోసం... వ్యక్తి అరెస్టు