కరీంనగర్ జిల్లా అర్కండ్లకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ గ్రామ సర్పంచ్ అనిత విద్యార్థులతో కలిసి ఆందోళన దిగారు. రోడ్డుపై బైఠాయించారు. బస్సు శంకరపట్నం మండలం ఏరడపల్లి వరకే వస్తుందని, తమ గ్రామ విద్యార్థులు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అర్కండ్లకు బస్సును నడిపించకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు కదిలేదని రోడ్డుపై బైఠాయించారు.
ఇదీ చూడండి : అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్