కరీంనగర్లోని ఒకటో, రెండో డిపోలను కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్ సందర్శించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జీవన్ ప్రసాద్తో కలిసి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తాత్కాలిక ఉద్యోగుల కోసం ఉదయాన్నే నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిపోల వద్దకు చేరుకున్నారు. రెండు డిపోల్లో 900 బస్సులు ఉండగా దాదాపు అన్ని నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష