ETV Bharat / state

'పోలీసు అమరులకు ఎక్స్​గ్రేషియా పెంచేందుకు కృషి చేస్తాం'

author img

By

Published : Oct 21, 2020, 2:57 PM IST

పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని కరీంనగర్​ కమిషనర్​ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను కోల్పోయిన వారికి చెల్లించే ఎక్స్​గ్రేషియాను మరింత పెంచేందుకు కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.

police commemoration celebrations at karimnagar
'పోలీసు అమరులకు ఎక్స్​గ్రేషియా పెంచేందుకు కృషి చేస్తాం'

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్​ వ్యవస్థలో గణనీయమైన మార్పు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. కరీంనగర్​ కమిషనరేట్​లో జరిగిన పోలీస్ సంస్మరణ దినోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్​తో పాటు కలెక్టర్​ శశాంక, సీపీ కమలాసన్​రెడ్డి, మేయర్​ సునీల్​రావు పాల్గొన్నారు.

పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించాక అమరవీరులకు మంత్రి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక పోలీస్​ విధానానికే ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. రేయింబవళ్లు పోలీసులు విధులు నిర్వర్తించినందువల్లే శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను కోల్పోయిన వారికి చెల్లించే ఎక్స్​గ్రేషియాను మరింత పెంచేందుకు కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్​ హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్​ వ్యవస్థలో గణనీయమైన మార్పు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. కరీంనగర్​ కమిషనరేట్​లో జరిగిన పోలీస్ సంస్మరణ దినోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్​తో పాటు కలెక్టర్​ శశాంక, సీపీ కమలాసన్​రెడ్డి, మేయర్​ సునీల్​రావు పాల్గొన్నారు.

పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించాక అమరవీరులకు మంత్రి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక పోలీస్​ విధానానికే ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. రేయింబవళ్లు పోలీసులు విధులు నిర్వర్తించినందువల్లే శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను కోల్పోయిన వారికి చెల్లించే ఎక్స్​గ్రేషియాను మరింత పెంచేందుకు కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్​ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండిః రాష్ట్రానికి కేంద్రం నుంచి బృందాలు పంపిస్తున్నాం: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.