ETV Bharat / state

election campaign in Huzurabad:పోటాపోటీగా ప్రచారం... విమర్శలే ప్రధాన అస్త్రం

author img

By

Published : Oct 19, 2021, 5:39 AM IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది (huzurabad by election campaign). అధికార తెరాసతో పాటు విపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. గ్రామాలు చుట్టేస్తున్న నేతలు అభ్యర్థులను ప్రసన్నం చేసుకుంటున్నారు. విమర్శలు ఎక్కుపెడుతూ గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

huzurabad
huzurabad

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది (huzurabad by election campaign). తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేశారు. చెల్పూర్, మల్లారెడ్డిపల్లితోపాటు వీణవంక మండలం చల్లూరులో రోడ్‌షో నిర్వహించారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతుంటే... భాజపా నేతలు చెప్పుకోవటానకి ఏమీ లేక అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించారు (Harish Rao comments on etela rajender). ఈటల రాజేందర్‌ స్వలాభం కోసమే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలను వ్యతిరేకించిన ఈటల..... ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. నల్లచట్టాలు పార్టీ మారగానే రంగు మారాయా అని ఎద్దేవా చేశారు. అందువల్లే ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. (huzurabad by election campaign) తెరాస ప్రభుత్వం అభివృద్ది గురించి మాట్లాడుతుంటే భాజపా... ఝూటా మాటలతో ఓట్లు దండుకొనే యత్నం చేస్తోందని హరీశ్​‌ రావు అన్నారు.

కౌంటర్​ ఇచ్చిన ఈటల

తెరాస నేతలపై భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు (etela rajendar comments on trs). ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం చల్లూరులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు (huzurabad by election campaign). గులాబీ జెండాకి ఓనర్లమని అన్నందుకు ముఖ్యమంత్రి తనను పదవి నుంచి తొలగించారని తెలిపారు. కొడుక్కి పోటీ వస్తున్నానని బయటకు పంపించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలుస్తామని ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ..

జమ్మికుంటలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ రోడ్‌షో (balmuri Venkat road show in jammi kunta ) నిర్వహించారు (huzurabad by election campaign). రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మానికం ఠాగూర్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ సహా ఇతర నేతలతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈటల రాజేందర్ ప్రజా సమస్యల కోసం రాజీనామా చేయలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ఆరోపించారు. కేవలం గట్టు పంచాయతీ కోసమే నియోజకవర్గ ప్రజల తలతాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరో 40 ఏళ్లు ప్రజలకు సేవ చేస్తానన్న బల్మూరి వెంకట్‌.... నిత్యం సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు మరింత పెంచేందుకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.

ఇదీ చూడండి: Koppula Eshwar: 'దళితబంధు ఆపాలని భాజపా కుట్రపన్నింది'

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది (huzurabad by election campaign). తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేశారు. చెల్పూర్, మల్లారెడ్డిపల్లితోపాటు వీణవంక మండలం చల్లూరులో రోడ్‌షో నిర్వహించారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతుంటే... భాజపా నేతలు చెప్పుకోవటానకి ఏమీ లేక అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించారు (Harish Rao comments on etela rajender). ఈటల రాజేందర్‌ స్వలాభం కోసమే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలను వ్యతిరేకించిన ఈటల..... ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. నల్లచట్టాలు పార్టీ మారగానే రంగు మారాయా అని ఎద్దేవా చేశారు. అందువల్లే ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. (huzurabad by election campaign) తెరాస ప్రభుత్వం అభివృద్ది గురించి మాట్లాడుతుంటే భాజపా... ఝూటా మాటలతో ఓట్లు దండుకొనే యత్నం చేస్తోందని హరీశ్​‌ రావు అన్నారు.

కౌంటర్​ ఇచ్చిన ఈటల

తెరాస నేతలపై భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు (etela rajendar comments on trs). ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం చల్లూరులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు (huzurabad by election campaign). గులాబీ జెండాకి ఓనర్లమని అన్నందుకు ముఖ్యమంత్రి తనను పదవి నుంచి తొలగించారని తెలిపారు. కొడుక్కి పోటీ వస్తున్నానని బయటకు పంపించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలుస్తామని ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ..

జమ్మికుంటలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ రోడ్‌షో (balmuri Venkat road show in jammi kunta ) నిర్వహించారు (huzurabad by election campaign). రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మానికం ఠాగూర్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ సహా ఇతర నేతలతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈటల రాజేందర్ ప్రజా సమస్యల కోసం రాజీనామా చేయలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ఆరోపించారు. కేవలం గట్టు పంచాయతీ కోసమే నియోజకవర్గ ప్రజల తలతాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరో 40 ఏళ్లు ప్రజలకు సేవ చేస్తానన్న బల్మూరి వెంకట్‌.... నిత్యం సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు మరింత పెంచేందుకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.

ఇదీ చూడండి: Koppula Eshwar: 'దళితబంధు ఆపాలని భాజపా కుట్రపన్నింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.