కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. మూలవిరాట్కు అర్చకులు చేసిన బ్రహ్మోత్సవ అలంకరణను చూసి భక్తజనం పులకరించిపోయారు.
ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో వెంకన్న అధ్యయనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు