కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల వద్ద భారీ వర్షాలు కురుస్తుండగా వరద ప్రవాహానికి బైపాస్ రోడ్డు మూసుకుపోయింది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి ఉండగా.. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు జగిత్యాల, నిజమాబాద్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు నిలిచిపోయాయి.
వెలిచాల మలుపు వద్ద లో లెవెల్ వంతెన నిర్మించి ఉండగా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల సుమారు పది గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురిసిన ప్రతి సారి వారం- పది రోజులపాటు వంతెనలో నీళ్లు నిలిచి వాహనాదురులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. దానికి ప్రత్యామ్నాయం వెతకాలని సూచించారు.
ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు