ETV Bharat / state

దుబయిలోని వలసజీవులకు నిత్యవసర సరకుల పంపిణీ

దుబయిలో వేతనాలు లేక పస్తులుంటున్న కరీంనగర్​ వాసులను ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు ఆదుకున్నారు. వలస జీవులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

author img

By

Published : Jul 16, 2020, 8:36 PM IST

ellala srinanna sevasamithi members groceries distribution in dubai
దుబాయిలోని వలసజీవులకు నిత్యావసర సరకుల పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దుబయిలో ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు వలస జీవులకు సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. దుబయిలో లాక్​డౌన్ అనంతరం వివిధ కంపెనీల్లో పనుల్లేక ఇక్కడి నుంచి వలస వెళ్లిన వారు ఖాళీగా ఉంటున్నారు. వేతనాలు లభించక పస్తులుంటున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి వలస వెళ్లిన వారు సామాజిక మాధ్యమాల్లో తమ కష్టాలను వివరించారు.

వేతనాలు లేక, ఇండియాకు తిరిగి వెళ్లేందుకు విమాన సర్వీసులు లేక చివరికి భోజనం లభించక ఇబ్బందులు పడుతున్నట్టు వేడుకున్నారు. దీనికి స్పందించిన ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు దుబయిలోని జెబెల్ అలీ లేబర్ క్యాంపులో వలస జీవులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దుబయిలో ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు వలస జీవులకు సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. దుబయిలో లాక్​డౌన్ అనంతరం వివిధ కంపెనీల్లో పనుల్లేక ఇక్కడి నుంచి వలస వెళ్లిన వారు ఖాళీగా ఉంటున్నారు. వేతనాలు లభించక పస్తులుంటున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి వలస వెళ్లిన వారు సామాజిక మాధ్యమాల్లో తమ కష్టాలను వివరించారు.

వేతనాలు లేక, ఇండియాకు తిరిగి వెళ్లేందుకు విమాన సర్వీసులు లేక చివరికి భోజనం లభించక ఇబ్బందులు పడుతున్నట్టు వేడుకున్నారు. దీనికి స్పందించిన ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు దుబయిలోని జెబెల్ అలీ లేబర్ క్యాంపులో వలస జీవులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఇవీ చూడండి: పరీక్షలు పెంచండి.. ఈటలతో మజ్లిస్ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.