ETV Bharat / state

'ధాన్యం కొనుగోలుకు దిగులు అక్కర్లేదు' - BC MINISTER GANGULA KAMALAKAR

కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ​పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​, మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశమయ్యారు. వరి పంట కొనుగోలు అంశంపై చర్చించారు.

పండిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల
పండిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల
author img

By

Published : Nov 27, 2019, 5:37 AM IST

Updated : Nov 27, 2019, 8:43 AM IST

ధాన్యం కొనుగోలు గురించి దిగులుపడాల్సిన అవసరం లేదని రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. పండించిన ప్రతీ పంట కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో వరి పంట కొనుగోలులో సమస్యలు, ఇతర విషయాలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి చర్చించారు.

కొనుగోళ్లలో రైతులకు ఎప్పటికప్పుడు త్వరితగతిన చెల్లింపులు చేస్తామని చెప్పారు. కొనుగోలు సందర్భంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇందుకు రైస్ మిల్లర్లు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డిదారిలో సరఫరా చేయకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పండిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల

ఇవీ చూడండి : ఇక ఉల్లి కిలో 40రూపాయలకే!

ధాన్యం కొనుగోలు గురించి దిగులుపడాల్సిన అవసరం లేదని రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. పండించిన ప్రతీ పంట కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో వరి పంట కొనుగోలులో సమస్యలు, ఇతర విషయాలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి చర్చించారు.

కొనుగోళ్లలో రైతులకు ఎప్పటికప్పుడు త్వరితగతిన చెల్లింపులు చేస్తామని చెప్పారు. కొనుగోలు సందర్భంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇందుకు రైస్ మిల్లర్లు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డిదారిలో సరఫరా చేయకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పండిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల

ఇవీ చూడండి : ఇక ఉల్లి కిలో 40రూపాయలకే!

TG_HYD_09_27_MINISTERS_WITH_BUYERS_AB_3181965 REPORTER : PRAVEEN KUMAR NOTE : FEED ON TAZA DESK ( ) రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఏ రైతు కొనుగోలు గురించి దిగులు పడాల్సిన పనిలేదని పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ రైతలకు భరోసా ఇచ్చారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి కరీంనగర్ పూర్వ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో వరి పంట కొనుగోలు విషయమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర విషయములపై చర్చించారు. కొనుగోళ్లలో రైతులకు ఎప్పటికప్పుడు త్వరితగతిన చెల్లింపులు చేస్తామని.. కొనుగోలు సందర్భంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇందుకు రైస్ మిల్లర్లు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి దొంగ దారిలో సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు..
Last Updated : Nov 27, 2019, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.