ETV Bharat / state

ఆన్​లైన్ ద్వారానే ఇసుక పంపిణి: కలెక్టర్ శశాంక - తోూాేూ లాైే ది సోలో ేోల్ ోజజ

ఇకపై ఇసుకను కరీంనగర్​ వాసులు ఆన్​లైన్​ ద్వారా బుకింగ్​ చేసుకోవాలని కలెక్టర్​ శశాంక తెలిపారు. అలా చేసుకున్న వారికే పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. కలెక్టర్​ కార్యాలయంలో అధికారులతో ఆయన జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

Distribution of sand through online mana sand app in Karimnagar
ఆన్​లైన్ ద్వారానే ఇసుక పంపిణి: కలెక్టర్ శశాంక
author img

By

Published : Jul 15, 2020, 9:36 AM IST

కరీంనగర్​ వాసులకు భవన నిర్మాణ పనుల కోసం ఆన్​లైన్ ద్వారానే ఇసుక పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, రెవెన్యూ, పోలిస్, మైనింగ్ అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక నుంచి మన ఇసుక”యాప్ ద్వారా పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 10 ఇసుక రీచ్​లు ఉన్నాయని.. ప్రతి మండలానికి అందుబాటులో మరికొన్ని రీచ్​లను గుర్తించామని తెలిపారు.

ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. రీచ్​ల వద్ద సరఫరా కోసం ట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయించాలని తహసీల్దార్​ను ఆదేశించారు. ట్రాక్టర్ల డ్రైవర్లకు లైసెన్స్​లు ఉండాలని, ట్రాక్టర్లకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు ఉండాలని సూచించారు. ఇసుక కోసం ప్రజలు మీ సేవ కేంద్రాలలో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇసుక పెనాల్టీ కింద 2019-20 సంవత్సరంలో 362 కేసులకు రూ. 22 లక్షల 95 వేల 700, 2020-21 సంవత్సరానికి గాను 63 కేసులకు 3 లక్షల 90 వేల రూపాయలను ఇసుక పెనాల్టీ కింద వసూలు చేయడమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

కరీంనగర్​ వాసులకు భవన నిర్మాణ పనుల కోసం ఆన్​లైన్ ద్వారానే ఇసుక పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, రెవెన్యూ, పోలిస్, మైనింగ్ అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక నుంచి మన ఇసుక”యాప్ ద్వారా పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 10 ఇసుక రీచ్​లు ఉన్నాయని.. ప్రతి మండలానికి అందుబాటులో మరికొన్ని రీచ్​లను గుర్తించామని తెలిపారు.

ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. రీచ్​ల వద్ద సరఫరా కోసం ట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయించాలని తహసీల్దార్​ను ఆదేశించారు. ట్రాక్టర్ల డ్రైవర్లకు లైసెన్స్​లు ఉండాలని, ట్రాక్టర్లకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు ఉండాలని సూచించారు. ఇసుక కోసం ప్రజలు మీ సేవ కేంద్రాలలో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇసుక పెనాల్టీ కింద 2019-20 సంవత్సరంలో 362 కేసులకు రూ. 22 లక్షల 95 వేల 700, 2020-21 సంవత్సరానికి గాను 63 కేసులకు 3 లక్షల 90 వేల రూపాయలను ఇసుక పెనాల్టీ కింద వసూలు చేయడమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.