కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కరోనా కలకలం రేపింది. చొప్పదండి పట్టణంలో పది మందికి పాజిటివ్ నిర్ధరణ కావటం వల్ల ప్రజలు అప్రమత్తం భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. రెండు కుటుంబాల్లో ఎనిమిది మంది, మరో ఇద్దరికి వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. దీనితో హోటళ్లు, ఇతర దుకాణాలు వారం రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేశారు. రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంటిజెన్ విధానంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు మొదలు పెట్టారు. తొలి రోజున 19 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు.
ఒకరిని శాతవాహన ఐసొలేశన్ కేంద్రానికి తరలించగా మరొకరిని హోం క్వారంటెన్ చేసి చికిత్స అందిస్తున్నారు. వెదిర గ్రామం నుంచి పాజిటివ్ వ్యక్తిని కరీంనగర్ ప్రధానాస్పత్రికి తరలించారు. లక్ష్మీపూర్ నుంచి మరో పాజటివ్ వ్యక్తిని కరీంనగర్లో చికిత్సకు తరలించారు. గంగాధర మండలం మధురానగర్లో నలుగురికి పాజిటివ్గా నిర్ధరించి చికిత్స అందిస్తున్నారు. గర్షకుర్తికి చెందిన వైరస్ బాధితుడు కరీంనగర్లో చికిత్స పొందుతూ మరణించారు. అతని కుటుంబ సభ్యులు హోం క్వారంటెన్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష