ETV Bharat / state

'రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో త్వరలోనే పూర్తి సేవలు'

కరీంనగర్​లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి కె.శశాంక సందర్శించారు. దవాఖానాలో నూతనంగా ఏర్పాటు చేసిన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్​ను పరిశీలించారు. త్వరలోనే పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తెస్తామని వివరించారు.

author img

By

Published : Mar 4, 2021, 9:07 AM IST

collector shashanka visited karimnagar government hospital
'రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో త్వరలోనే పూర్తి సేవలు'

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్​ను జిల్లా కలెక్టర్ కె.శశాంక సందర్శించారు. జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ కనుమల్ల విజయతో కలిసి పరిశీలించారు.

జిల్లాలోని పేదలకు 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసేందుకు వీలుగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రస్తుతం 42 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షుగర్, థైరాయిడ్, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, కాలేయ పరీక్షలు, మూత్ర పరీక్షలు మొదలగునవి ఉచితంగా నిర్వహిస్తారని వివరించారు.

collector shashanka visited karimnagar government hospital
'రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో త్వరలోనే పూర్తి సేవలు'

ఈ రోగ నిర్ధారణ కేంద్రంలో ప్రస్తుతం డ్రైరన్​ నిర్వహిస్తున్నామని.. త్వరలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్​ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి నమూనాలు సేకరించి.. పంపేందుకు లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిని ఆదేశించారు.

ఈ రోగ నిర్ధారణ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో.. నిర్వహణ పకడ్బందీగా కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం పక్కన స్కానింగ్ సెంటర్, రేడియాలజీ సెంటర్​ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సేవ పరీక్ష గదిని ఆయన పరిశీలించారు.

ఇదీ చూడండి: ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక అధికారులు

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్​ను జిల్లా కలెక్టర్ కె.శశాంక సందర్శించారు. జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ కనుమల్ల విజయతో కలిసి పరిశీలించారు.

జిల్లాలోని పేదలకు 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసేందుకు వీలుగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రస్తుతం 42 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షుగర్, థైరాయిడ్, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, కాలేయ పరీక్షలు, మూత్ర పరీక్షలు మొదలగునవి ఉచితంగా నిర్వహిస్తారని వివరించారు.

collector shashanka visited karimnagar government hospital
'రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో త్వరలోనే పూర్తి సేవలు'

ఈ రోగ నిర్ధారణ కేంద్రంలో ప్రస్తుతం డ్రైరన్​ నిర్వహిస్తున్నామని.. త్వరలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్​ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి నమూనాలు సేకరించి.. పంపేందుకు లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిని ఆదేశించారు.

ఈ రోగ నిర్ధారణ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో.. నిర్వహణ పకడ్బందీగా కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం పక్కన స్కానింగ్ సెంటర్, రేడియాలజీ సెంటర్​ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సేవ పరీక్ష గదిని ఆయన పరిశీలించారు.

ఇదీ చూడండి: ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.