కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్గా శశాంక బాధ్యతలు చేపట్టారు. జిల్లా డీఆర్వో ప్రావీణ్య, కలెక్టరేట్ సిబ్బంది మేళతాళాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. మొదటగా కలెక్టర్ ఛాంబర్లో వినాయకునికి పూజలు నిర్వహించారు.
అనంతరం కుర్చీలో కూర్చుని కలెక్టర్ శశాంక సంతకాలు చేశారు. జిల్లా అధికారులు శశాంకకు పూల కుండీలను అందించి పరిచయం చేసుకున్నారు. కరీంనగర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని శశాంక తెలిపారు.
ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు