కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. రైతులకు చేరువగా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, తగిన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్తో కలిసి మార్కండేయ దేవాలయంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయం సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గుర్రం నీరజ పాల్గొన్నారు.