ETV Bharat / state

మంచులో అదుపుతప్పిన కారు - ప్రమాదంలో తెలంగాణ యువకుడి మృతి - TELANGANA MAN DIES IN AMERICA

అమెరికాలోని న్యూహెవెన్​లో విషాదం - మంచులో కారు ఢీకొని తెలంగాణ యువకుడి దుర్మరణం - గత ఏడాది యూఎస్ ​వెళ్లిన మృతుడు నీరజ్ గౌడ్

Telangana man dies in America
Telangana man dies in America (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2024, 7:51 PM IST

Telangana man dies in America : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు ఆమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఘటనలో జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన శ్రీధర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సంవత్సరంన్నర క్రితం వీరిద్దరు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి న్యూహెవెన్ సిటీలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు.

మంచులో కారు అదుపుతప్పడంతో ప్రమాదం : ఈ నెల 16న బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా తీవ్రంగా మంచు కురుస్తుండడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పోలీసు పెట్రోలింగ్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన నీరజ్ గౌడ్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీధర్​కు తీవ్ర గాయాలయ్యాయి. అమెరికా పెట్రోలింగ్ పోలీసు కారులోని సిబ్బందికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదు నిమిషాల్లో వీరు నివాసం ఉండే రూమ్ కు చేరుకునే సమీపంలో ప్రమాదం చోటు చేసుకోవడం ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోధన్​కు చెందిన పంజాల నీరజ్ గౌడ్ తండ్రి శంకర్ గౌడ్ నెమ్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహన్ని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Telangana man dies in America : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు ఆమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఘటనలో జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన శ్రీధర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సంవత్సరంన్నర క్రితం వీరిద్దరు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి న్యూహెవెన్ సిటీలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు.

మంచులో కారు అదుపుతప్పడంతో ప్రమాదం : ఈ నెల 16న బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా తీవ్రంగా మంచు కురుస్తుండడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పోలీసు పెట్రోలింగ్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన నీరజ్ గౌడ్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీధర్​కు తీవ్ర గాయాలయ్యాయి. అమెరికా పెట్రోలింగ్ పోలీసు కారులోని సిబ్బందికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదు నిమిషాల్లో వీరు నివాసం ఉండే రూమ్ కు చేరుకునే సమీపంలో ప్రమాదం చోటు చేసుకోవడం ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోధన్​కు చెందిన పంజాల నీరజ్ గౌడ్ తండ్రి శంకర్ గౌడ్ నెమ్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహన్ని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.

అమెరికాలో జరిగిన ప్రమాదంలో కోదాడ వాసి మృతి

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.