ETV Bharat / state

రెవెన్యూ రికార్డుల నమోదుకై భాజపా నేతల ఆందోళన

author img

By

Published : Sep 11, 2020, 3:11 PM IST

వంశపారంపర్యంగా సేద్యం చేసుకుంటున్న భూములను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని కరీంనగర్​ జిల్లా భాజపా నాయకులు డిమాండ్ చేశారు. చొప్పదండి తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

Bjp leaders protest at choppadandi in karimnagar district
రెవెన్యూ రికార్డుల నమోదుకై భాజపా నేతల ఆందోళన

కరీంనగర్​ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. వంశపారంపర్యంగా సేద్యం చేసుకుంటున్న భూములను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విపరీతంగా జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాగంపేటలో భూములు రికార్డుల్లో నమోదు చేయకపోవడం వల్ల రైతు బంధు, రైతు బీమా వర్తించడం లేదని వాపోయారు. భూముల నమోదు ప్రక్రియను సత్వరమే మొదలుపెట్టాలని కోరుతూ తహసీల్దార్ అంబటి రజితకు వినతి పత్రాన్ని సమర్పించారు.

కరీంనగర్​ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. వంశపారంపర్యంగా సేద్యం చేసుకుంటున్న భూములను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విపరీతంగా జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాగంపేటలో భూములు రికార్డుల్లో నమోదు చేయకపోవడం వల్ల రైతు బంధు, రైతు బీమా వర్తించడం లేదని వాపోయారు. భూముల నమోదు ప్రక్రియను సత్వరమే మొదలుపెట్టాలని కోరుతూ తహసీల్దార్ అంబటి రజితకు వినతి పత్రాన్ని సమర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.