ETV Bharat / state

కరోనా కాటుకు సర్పంచ్ మృతి

author img

By

Published : May 3, 2021, 10:17 PM IST

కరోనా మహమ్మారితో ఓ మహిళా సర్పంచ్ మరణించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చోటుచేసుకుంది.

sarpanch died with corona
sarpanch died with corona

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట్ సర్పంచ్ పరవ్వ(55) కరోనాతో మృతి చెందారు. గత నెల 25న కొవిడ్ పాజిటివ్​గా తేలడంతో.. ఇంట్లోనే ఉంటూ ఆమె చికిత్స తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం శ్వాస సరిగా అందకపోవడంతో.. కుటుంబసభ్యులు ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పరిస్థితి విషమించడంతో.. ఇవాళ సాయంత్రం ఆమె కన్ను ముశారు. మృతదేహానికి గ్రామ పంచాయతీ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట్ సర్పంచ్ పరవ్వ(55) కరోనాతో మృతి చెందారు. గత నెల 25న కొవిడ్ పాజిటివ్​గా తేలడంతో.. ఇంట్లోనే ఉంటూ ఆమె చికిత్స తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం శ్వాస సరిగా అందకపోవడంతో.. కుటుంబసభ్యులు ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పరిస్థితి విషమించడంతో.. ఇవాళ సాయంత్రం ఆమె కన్ను ముశారు. మృతదేహానికి గ్రామ పంచాయతీ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: ఈటలకు రాజేందర్​కు ఘనస్వాగతం పలికిన అభిమానులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.