ETV Bharat / state

కామారెడ్డి జిల్లాలో రోడ్డెక్కిన ప్రజా రవాణా

author img

By

Published : May 19, 2020, 1:12 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచే వివిధ రూట్లకు బస్సులు బయల్దేరాయి. ​

kamareddy district latest news
kamareddy district latest news

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కామారెడ్డి, బాస్సువాడ డిపోల నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్​ అందజేస్తున్నారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు.

ఎక్స్​ప్రెస్ బస్సులలో 33, ఆర్డినరీ బస్సులలో 30 మందికి మాత్రమే ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు నడిపిస్తామని కామారెడ్డి డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కామారెడ్డి, బాస్సువాడ డిపోల నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్​ అందజేస్తున్నారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు.

ఎక్స్​ప్రెస్ బస్సులలో 33, ఆర్డినరీ బస్సులలో 30 మందికి మాత్రమే ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు నడిపిస్తామని కామారెడ్డి డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.