కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మికి 2 లక్షల రూపాయల బీమా డబ్బుల చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. తెరాస సభ్యత్వం కలిగిన ఓరుగంటి బాలరాజు కరెంట్ షాక్ తగిలి మరణించాడు. పార్టీ చెల్లించిన బీమా సౌకర్యంలో భాగంగా సదరు కుటుంబానికి రూ. 2 లక్షలు అందించారు.
తెరాస పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గోవర్ధన్ అన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్కు మరో 229 టన్నుల అమోనియం నైట్రేట్!