వినాయక నిమజ్జనంలో ఓ పోలీసు అధికారి తన భక్తిని చాటుకున్నాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రూసేగావ్లో గణేశుడి నిమజ్జనానికి బందోబస్తుకు వెళ్లిన ఏఎస్సై వెంకట్రావ్.. స్థానికులతో పాటు భజన చేశారు. ఈ మండలం మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ఆ రాష్ట్ర సాంప్రదాయం ప్రకారం భజన పాటలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాటలు పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి: లంచం అడిగిన తహసీల్దార్కు దున్నపోతు బహుమానం!