ETV Bharat / state

రైతులు నష్టపోకూడదనే కొనుగోలు కేంద్రాలు: పోచారం భాస్కర్ రెడ్డి

author img

By

Published : Apr 2, 2021, 2:21 PM IST

రైతులు నష్టపోకూదనే ధాన్యం కొనుగోలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్​తాండలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

dccb chairmanPocharam Bhaskar Reddy
రాంపూర్​తాండలో ధాన్యం కొనుగోలు కేంద్రం

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా మరోసారి రుజువైందని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్​తాండలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను పక్కన పెట్టి... రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. మొదట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని రైతన్నలు బాధపడ్డారని తెలిపారు. మంచి మనసుతో అన్నదాతలను ఆదుకుంటున్న సీఎంకు పోచారం భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: ఖమ్మంలో కేటీఆర్.. ఐటీ హబ్​ రెండో దశకు అంకురార్పణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా మరోసారి రుజువైందని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్​తాండలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను పక్కన పెట్టి... రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. మొదట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని రైతన్నలు బాధపడ్డారని తెలిపారు. మంచి మనసుతో అన్నదాతలను ఆదుకుంటున్న సీఎంకు పోచారం భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: ఖమ్మంలో కేటీఆర్.. ఐటీ హబ్​ రెండో దశకు అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.