కామారెడ్డి మున్సిపాలిటీ రామేశ్వరపల్లి గ్రామంలో సంతోష్-రమ్య దంపతుల మూడు నెలల చిన్నారి ఆకస్మాత్తుగా మృతి చెందింది. వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు.
ఈరోజు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి 3 నెలల టీకా వేయించామన్నారు. ఆ టీకా వికటించి చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ టీకానే మృతికి కారణమని విలపించారు. ఇప్పటి వరకూ చిన్నారికి ఎలాంటి జబ్బు లేదని పేర్కొన్నారు. చిన్నారి మృతిపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి : రేవంత్ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్ రెడ్డి