పార్లమెంట్లో వాడివేడి చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సభాపతి సభను నియంత్రిస్తున్నారు. ఇదంతా దిల్లీ పార్లమెంట్లో జరిగింది కాదు. కామారెడ్డి జిల్లా దోమకొండలోని ఓ గురుకులంలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ నమూనాలో కనిపించిన దృశ్యాలు. దోమకొండలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పదకొండు పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. పార్లమెంట్ తరహాలో వివిధ పదవులతో దేశ రాజకీయాలపై ప్రసంగాలు, ప్రదర్శన నిర్వహించారు. పిల్లలు రాజకీయ నాయకుల వేషధారణతో యూత్ పార్లమెంట్లో పాల్గొని అలరించారు. యూత్ పార్లమెంట్లో పాల్గొనడం మంచి అనుభూతి, అనుభవాన్ని మిగిల్చిందని విద్యార్థులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రహదారి పూర్తి చేయాలంటూ విద్యార్థుల రాస్తారోకో