కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదని వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ముందు జాగ్రత్తగా జిల్లా ఆస్పత్రిలో ఆరు పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కరోనాపై అనుమానాలుంటే టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించాలని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని కోరారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.
ఇవీచూడండి: కరోనా వైరస్: తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు