ETV Bharat / state

సామాన్యులు గాంధీకి.. ఎమ్మెల్యేలు యశోదకా..? - కామారెడ్డిలో నిత్యావసరాలు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ

రాహుల్​ గాంధీ జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో భౌతిక దూరం పాటిస్తూ మాజీ మంత్రి షబ్బీర్​ పేదలకు నిత్యావసరాలను అందజేశారు. కరోనా వస్తే ఎంతటివారైనా గాంధీకి వెళ్లాలన్న కేసీఆర్​... తమ పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం యశోదాకు ఎందుకు పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

former minister shabbir ali grocery distribution at kamareddy
కామారెడ్డిలో నిత్యావసరాలు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ
author img

By

Published : Jun 19, 2020, 5:34 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో రాహుల్​ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకు మాజీ మంత్రి షబ్బీర్​ అలీ నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడిలో 20 మంది సైనికులు మృత్యువాతపడటం తనను ఎంతో కలచివేసిందని షబ్బీర్​ అలీ అన్నారు. రాష్ట్రానికి చెందిన కర్నల్​ సంతోష్​బాబు మరణిస్తే సీఎం స్వయంగా వెళ్లి నివాళులర్పించలేదని దుయ్యబట్టారు. ఎంతటివారికైనా కరోనా వస్తే గాంధీకి వెళ్లాలని సూచించిన కేసీఆర్​... ఎమ్మెల్యేలకు వస్తే యశోదాకు ఎందుకు పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

పేదలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందించి.. విద్యుత్​ బిల్లుల ద్వారా సీఎం కేసీఆర్​ వడ్డీ వ్యాపారానికి తెరలేపారని షబ్బీర్​ అలీ ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల పథకం పూర్తి చేయడమే.. తన చిరకాల కోరిక అని.. రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చిన తరువాతే తుదిశ్వాస వదులుతానని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోనున్నట్లు వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో రాహుల్​ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకు మాజీ మంత్రి షబ్బీర్​ అలీ నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన దాడిలో 20 మంది సైనికులు మృత్యువాతపడటం తనను ఎంతో కలచివేసిందని షబ్బీర్​ అలీ అన్నారు. రాష్ట్రానికి చెందిన కర్నల్​ సంతోష్​బాబు మరణిస్తే సీఎం స్వయంగా వెళ్లి నివాళులర్పించలేదని దుయ్యబట్టారు. ఎంతటివారికైనా కరోనా వస్తే గాంధీకి వెళ్లాలని సూచించిన కేసీఆర్​... ఎమ్మెల్యేలకు వస్తే యశోదాకు ఎందుకు పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

పేదలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందించి.. విద్యుత్​ బిల్లుల ద్వారా సీఎం కేసీఆర్​ వడ్డీ వ్యాపారానికి తెరలేపారని షబ్బీర్​ అలీ ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల పథకం పూర్తి చేయడమే.. తన చిరకాల కోరిక అని.. రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చిన తరువాతే తుదిశ్వాస వదులుతానని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోనున్నట్లు వెల్లడించారు.

ఇదీచూడండి: సీనియర్​ ఐఏఎస్​ అధికారి బీపీ విఠల్ కన్నుమూత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.