ETV Bharat / state

సభాపతి పోచారానికి సన్మానం.. కృతజ్ఞతలు తెలిపిన రైతులు

author img

By

Published : Mar 19, 2021, 2:13 PM IST

సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని బాన్సువాడలో రైతులు సన్మానించారు. ఆయన ప్రత్యేక కృషితోనే పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరిగాయని కొనియాడారు. పట్టణంలోని ఆయన నివాసంలో శాలువాతో సత్కరించారు.

farmers-honor-to-speaker-pocharam-srinivas-reddy-at-banswada-in-nizamabad-district
సభాపతి పోచారానికి సన్మానం.. కృతజ్ఞతలు తెలిపిన రైతులు

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం బడ్జెట్​లో నిధులు కేటాయించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆనందంతో సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డిని చందూరు రైతులు సన్మానించారు. బాన్సువాడలోని ఆయన నివాసంలో పోచారాన్ని శాలువాతో సత్కరించి... ఆయన ప్రత్యేక కృషితోనే నిధులు మంజూరు అయ్యాయని రైతులు కొనియాడారు.

ఈ ఎత్తిపోతల నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతమైన చందూరు మండలంలోని భూములకు లిఫ్టులను ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని సభాపతి పోచారం నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జాకోరా, చందూరు ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం బడ్జెట్​లో నిధులు కేటాయించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆనందంతో సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డిని చందూరు రైతులు సన్మానించారు. బాన్సువాడలోని ఆయన నివాసంలో పోచారాన్ని శాలువాతో సత్కరించి... ఆయన ప్రత్యేక కృషితోనే నిధులు మంజూరు అయ్యాయని రైతులు కొనియాడారు.

ఈ ఎత్తిపోతల నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతమైన చందూరు మండలంలోని భూములకు లిఫ్టులను ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని సభాపతి పోచారం నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: దూలపల్లి అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.