కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. కాగా... ప్రస్తుతం ఆ ముగ్గురిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
ఇవీ చూడండి: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ: హైకోర్టు