జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శుక్రవారం రాత్రి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయాధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
మంత్రితోపాటు ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్లు కలిసి ముందుగా రుద్రయాగంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికీ ప్రత్యేక అభిషేకాలు చేసి అమ్మవారి కల్యాణోత్సవంను తిలకించారు. ఆ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చూడండి : రామప్ప కాటన్ పేరుతో రానున్న కొత్త రకం చీరలు