జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాలకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలాశయం పూర్తి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.009 టీఎంసీలు ఉంది . ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు అయితే ఇప్పుడు 318.200 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం లక్షా 90 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. దిగువన ఉన్న శ్రీశైలానికి లక్షా 79 వేల 500 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి.. సినిమాలే నా జీవితం కాదు: కాజల్