ETV Bharat / state

నీట మునిగిన పురవీధులు.. ఎమ్మెల్యే పరిశీలన

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గద్వాల పట్టణం అతలాకుతలమైంది. గద్వాల-రాయచూర్ రహదారిపై తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జి నీటిలో కొట్టుకుపోవడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి సమీక్షించారు.

author img

By

Published : Sep 19, 2020, 11:12 AM IST

gadwal town floating in water and mla krishnamohanreddy visitataion
జలమయమైన పురవీధులు.. ఎమ్మెల్యే పరిశీలన

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలో దెబ్బతిన్న కాలనీలకు మున్సిపల్ ఛైర్మన్​ బీఎస్​ కేశవ్​తో కలిసి... ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. నీరు నిల్వ ఉండకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో పట్టణంలో 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

గద్వాల్-రాయచూర్​ రహదారిపై నందిన్నె గ్రామం వద్ద తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున... రాయచూర్​ నుంచి వస్తున్న లారీ వాగులో పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలో దెబ్బతిన్న కాలనీలకు మున్సిపల్ ఛైర్మన్​ బీఎస్​ కేశవ్​తో కలిసి... ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. నీరు నిల్వ ఉండకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో పట్టణంలో 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

గద్వాల్-రాయచూర్​ రహదారిపై నందిన్నె గ్రామం వద్ద తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున... రాయచూర్​ నుంచి వస్తున్న లారీ వాగులో పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

ఇదీ చూడండి: జూరాలకు కొనసాగుతున్న వరద... 19 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.