ETV Bharat / state

గ్రామ సచివాలయానికి తాళం వేసి మహిళా రైతు నిరసన

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ మహిళ గ్రామ సచివాలయానికి తాళం వేసి.. ఆఫీసు ఎదుటే ఆందోళన చేపట్టింది. సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోవడం లేదంటూ మండిపడింది.

author img

By

Published : Feb 5, 2021, 7:48 PM IST

Frustrated with the negligence of the authorities, woman farmer locked the village secretariat and raised concerns
గ్రామ సచివాలయానికి తాళం వేసి.. మహిళ రైతు నిరసన

అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన ఓ మహిళా రైతు.. ఆగ్రహంతో ఊగిపోయింది. గ్రామ సచివాలయానికి తాళం వేసి.. ఆఫీసు ఎదుటే ఆందోళన చేపట్టింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో చోటుచేసుకుంది.

బైరాపురం గ్రామానికి చెందిన సువర్ణ పొలం పక్కనే.. గ్రామ సచివాలయానికి చెందిన డంపింగ్ ​యార్డ్ ఉంది. అందులో వేస్తోన్న చెత్త చెదారం మొత్తం.. పొలం లోనికి వస్తుండటంతో ఆ విషయాన్ని ఆమె పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

పంచాయతీ కార్యదర్శికి చెప్పినా.. లాభం లేక పోవడంతో సువర్ణ విసిగిపోయింది. నేరుగా కార్యాలయానికి వెళ్లి.. తాళం వేసి నిరసన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించేంత వరకు అక్కడినుంచి కదిలేది లేదంటూ.. ఆందోళన చేసింది.

ఇదీ చదవండి: మమ్ముదాటి మీరు పోలేరులే.. ఇది నిజములే..!

అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన ఓ మహిళా రైతు.. ఆగ్రహంతో ఊగిపోయింది. గ్రామ సచివాలయానికి తాళం వేసి.. ఆఫీసు ఎదుటే ఆందోళన చేపట్టింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో చోటుచేసుకుంది.

బైరాపురం గ్రామానికి చెందిన సువర్ణ పొలం పక్కనే.. గ్రామ సచివాలయానికి చెందిన డంపింగ్ ​యార్డ్ ఉంది. అందులో వేస్తోన్న చెత్త చెదారం మొత్తం.. పొలం లోనికి వస్తుండటంతో ఆ విషయాన్ని ఆమె పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

పంచాయతీ కార్యదర్శికి చెప్పినా.. లాభం లేక పోవడంతో సువర్ణ విసిగిపోయింది. నేరుగా కార్యాలయానికి వెళ్లి.. తాళం వేసి నిరసన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించేంత వరకు అక్కడినుంచి కదిలేది లేదంటూ.. ఆందోళన చేసింది.

ఇదీ చదవండి: మమ్ముదాటి మీరు పోలేరులే.. ఇది నిజములే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.