ETV Bharat / state

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు: ఎస్పీ రంజన్​ - జోగులాంబ గద్వాల జిల్లా రంజన్​ రతన్​కుమార్​ వార్తలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​కుమార్​ హెచ్చరించారు. ఇప్పటి వరకు 9,900 కిలోల విత్తనాలు పట్టుబడగా 16 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు: ఎస్పీ రంజన్​
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు: ఎస్పీ రంజన్​
author img

By

Published : Jun 6, 2021, 10:33 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గత వారం నుంచి నకిలీ విత్తనాలు విక్రయంచే వారిపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు, వ్యవసాయ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. రైతులను మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ రంజన్​ రతన్​కుమార్​ హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి 18 కేసుల్లో 9,900 కిలోల విత్తనాలు పట్టుబడగా 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

గతేడాది కూడా 34 కేసుల్లో 3,600 కిలోల విత్తనాలు పట్టుపడగా 54 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గతేడాది నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుని నకిలీ విత్తనాల విక్రయిస్తున్నవారిపై పీడీ యాక్టు కింద కేసుల నమోదుకు నివేదికలు కూడా పంపడం జరిగిందని ఎస్పీ చెప్పారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గత వారం నుంచి నకిలీ విత్తనాలు విక్రయంచే వారిపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు, వ్యవసాయ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. రైతులను మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ రంజన్​ రతన్​కుమార్​ హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి 18 కేసుల్లో 9,900 కిలోల విత్తనాలు పట్టుబడగా 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

గతేడాది కూడా 34 కేసుల్లో 3,600 కిలోల విత్తనాలు పట్టుపడగా 54 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గతేడాది నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుని నకిలీ విత్తనాల విక్రయిస్తున్నవారిపై పీడీ యాక్టు కింద కేసుల నమోదుకు నివేదికలు కూడా పంపడం జరిగిందని ఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండి: Software Engineer: కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.