జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారిని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దర్శించుకున్నారు. వసంతపంచమి సందర్భంగా కలశంతో అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే వసంతపంచమి రోజు అమ్మవారు నిజరూప దర్శనమిస్తారు.
భక్తులు పెద్దసంఖ్యలో కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల వేషాధారణలో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐదు రోజులుగా జోగులాంబ అమ్మవారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.