జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో బ్రహ్మంగారు చెప్పినట్టు వింతలు జరుగుతున్నాయంటున్నారు గ్రామస్థులు. ఇంతకి ఆ వింత ఏంటి అనుకుంటున్నారా.... స్థానికంగా నివాసముండే మల్లారెడ్డి తన ఇంటి ఆవరణలో ఆరు మామిడి చెట్లను పదేళ్ల క్రితం నాటాడు. ప్రతి ఉగాదికి మామిడికాయలు కాస్తూ ఉన్నాయి. వీటిలో ఒక చెట్టు మాత్రం మళ్లీ కాపు కాసింది. గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి కాయలను చూసేందుకు అందరూ ఎగబడుతున్నారు.
ఇవీ చూడండి: సింగాయపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం