భూపాలపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న జింకల పార్కులో కోల్కతా, పచ్చిమ బంగాకు చెందిన ఆరుగురు బాలకార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ముస్కాన్ ఆపరేషన్-5 లో భాగంగా నిర్వహించిన దాడిలో పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి చిన్నారులను గుర్తించామని... కాంట్రాక్టర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీబీసీఐడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్లో తప్పిపోయిన పిల్లలు, బాలకార్మికులు, బెగ్గింగ్ చిల్డ్రన్ను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వటం, పాఠశాలలో చేర్పించటం, తల్లిందండ్రులకు అప్పజెప్పటం లాంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 1 న మొదలైన ఈ ఆపరేషన్ 31 వరకు కొనసాగనుందని అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం