జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో 11 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీలోని 30వ వార్డులోని వాసవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'