ETV Bharat / state

వేసవిలో మూగజీవాల దాహం తీరేదెలా..?

మార్చిలోనే భానుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు నీటి సదుపాయం లేక మనుషులతో పాటు పశువులు అల్లాడుతున్నాయి. జయశంకర్​ జిల్లాలో మూగ జీవాలపై బతికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ద్వారా నీళ్లు వదిలి చెరువులను నింపాలని అధికారులను కోరుతున్నారు.

author img

By

Published : Mar 28, 2019, 3:32 PM IST

మూగ జీవాలు
నీటి సదుపాయం లేక మూగజీవాల అవస్థలు
మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు మూగ జీవాలు సైతం తట్టుకోలేక పోతున్నాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఎండలకు తాళలేక పశువులు అల్లాడుతున్నాయి. వీటి దాహం తీరేందుకు కాలువల ద్వారా నీళ్లను చెరువులకు వదలాలని పశువుల కాపర్లు కోరుతున్నారు. ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్న చెరువుల్లో నీటిని ఆసాములు మోటార్లు పెట్టి తోడేస్తున్నారని ఆరోపించారు.

పశువులు చనిపోయే పరిస్థితి

పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో కుంటల్లో నీళ్లు లేక అవి చనిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మేసే ప్రాంతాల్లో కుంటలు ఏర్పాటు చేసి నీరందించాలని కోరుతున్నారు. గొర్రెల, బర్రెల సంరక్షణకు పశువైద్యుల నుంచి కూడా ఎలాంటి సూచనలు అందడం లేదని వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్​లు స్పందించి మూగజీవాల సంరక్షణ చర్యలు చేపట్టాలని పశువుల కాపర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి :"నామీద సర్జికల్​ స్ట్రైక్​ ఎందుకు జరిగిందో"

నీటి సదుపాయం లేక మూగజీవాల అవస్థలు
మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు మూగ జీవాలు సైతం తట్టుకోలేక పోతున్నాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఎండలకు తాళలేక పశువులు అల్లాడుతున్నాయి. వీటి దాహం తీరేందుకు కాలువల ద్వారా నీళ్లను చెరువులకు వదలాలని పశువుల కాపర్లు కోరుతున్నారు. ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్న చెరువుల్లో నీటిని ఆసాములు మోటార్లు పెట్టి తోడేస్తున్నారని ఆరోపించారు.

పశువులు చనిపోయే పరిస్థితి

పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలో కుంటల్లో నీళ్లు లేక అవి చనిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మేసే ప్రాంతాల్లో కుంటలు ఏర్పాటు చేసి నీరందించాలని కోరుతున్నారు. గొర్రెల, బర్రెల సంరక్షణకు పశువైద్యుల నుంచి కూడా ఎలాంటి సూచనలు అందడం లేదని వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్​లు స్పందించి మూగజీవాల సంరక్షణ చర్యలు చేపట్టాలని పశువుల కాపర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి :"నామీద సర్జికల్​ స్ట్రైక్​ ఎందుకు జరిగిందో"

Intro:Tg_wgl_46_26_muga_jivula_kaparla_avasthalu_pkg_avb_c8

V.Sathish Bhupalapally Contributer.

యాంకర్( ): మార్చి నెలలోనే ఎండలు విపరీతంగా కొట్టడంతో మూగ జీవులకు దాహం తీర్చేందుకు చెరువులు కుంటలు ఎండిపోయినా నానా అవస్థలు పడుతున్న మూగజీవుల కాపర్లు.

వాయిస్ ఓవర్:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ప్రాంతం లో విపరీతమైన ఎండలకు దాహం తీర్చేందుకు అవస్థలు పడుతున్నామని కాపర్లు వ్యక్తం చేస్తున్నారు. దాహం తీర్చేందుకు కాలువల ద్వారా నీళ్ల ను చెరువులకు వదిలి ఆదుకోవాలని గ్రామపంచాయతీ సర్పంచ్ లు, అధికారులు వేడుకుంటున్నారు. మూగ జీవులకు పశు వైద్య శాఖ నుండి ఎలాంటి సూచనలను సలహాలు ఇవ్వడం లేదని సరైన వైద్యం కూడా అందించడం లేదని వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవులకు ఏమన్నా అయితే వైద్యుల వలె మేమే చేసుకుంటున్నామని వైద్యులు ఉండి కూడా ఏం చేయట్లేదు అని వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్న క్రమంలో లో ముందస్తు గా అధికారులు చర్యలు తీసుకొని మూగజీవుల దాహం తీర్చేకొరకు,గ్రామాల్లో కుంటలు చెరువుల్లో నీళ్ళు నింపి ఆదుకోవాలని వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి ముందస్తుగానే దాహం కొరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నోరుంటే చెప్పుకునేది కానీ మూగజీవులకు ఏమైనా చూసుకునేది కాపాలదరుడే కాబట్టి మూగజీవుల సహాయం కొరకు ప్రతి గ్రామం లో నీళ్ళు నింపి మూగజీవులను రక్షణగా ఉండాలని కోరుకుంటున్నారు. ముందస్తుగా వేసవిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రతి గ్రామంలో చురువులు,కుంటల లో నీళ్ళు నింపి దాహం తీర్చాలని వేడుకున్నారు. ఇంకా ముందు ముందు ఎండలు విపరీతంగా పెరగడంతో మూగ జీవులకు దాహం దొరక చనిపోయే పరిస్థితి ఉందని అన్నారు. వీటిని కాపాడుకోవాలంటే ముఖ్యంగా దాహం ఒకటేనని అన్నారు. పశువుల దాహం కొరకు ఇతర గ్రామాలకు చాలా దూరం వెళ్లి దాహం తీర్చు వలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు .ఏ ఊరి చెరువులు కుంటలలో నీరు ఉంటే ఈ మూగ జీవులను పోషించుకోవడానికి సులువుగా ఉంటుందని వ్యక్తం చేశారు. గొర్రెలు బర్రెలు చివరలో మేత కోసం తిరుగుతూ ఉంటాయి దాహమేస్తే చెరువుల్లో కుంటల్లో నీళ్లు తాగుతూ ఉండాలి కాబట్టి అందులోనే నీళ్లు లేక పోయేసరికి మాడు కడుపుతో ఇంటికి వస్తున్నాయని దిగులు చెందుతున్నారు. అధికారులు మూగజీవుల రక్షణ కొరకు ముందస్తు చర్యలు చేపట్టి ప్రతి గ్రామంలో చెరువులు , కుంటాలలో నీళ్లు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

బైట్.1).కొమురయ్య(గొర్ల కాపరి).
2).రాజు
3).పోశాలు.


Body:Tg_wgl_46_26_muga_jivula_kaparla_avasthalu_pkg_avb_c8


Conclusion:Tg_wgl_46_26_muga_jivula_kaparla_avasthalu_pkg_avb_c8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.