ETV Bharat / state

Station Ghanpur assembly constituency issue : స్టేషన్​ఘన్​పూర్​లో రాజుకున్న రాజకీయవేడి.. టికెట్​పై ఎవరికి వారు ధీమా..!

author img

By

Published : Aug 18, 2023, 8:50 PM IST

Political War in Station Ghanpur : జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్​పూర్​ నియోజకవర్గంపై అధికార పార్టీలో మళ్లీ పంచాయతీ ముదిరింది. అధిష్ఠానం ఆదేశాలతో కడియం శ్రీహరి, రాజయ్య మధ్య కొన్నాళ్లుగా సద్దుమణిగిన మాటలయుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ నాదే అంటూఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు.

Political War in Station Ghanpur
Station Ghanpur assembly constituency issue
Station Ghanpur assembly constituency issue స్టేషన్​ఘన్​పూర్​లో రాజుకున్న రాజకీయవేడి.. టికెట్​పై ఎవరికి వారు ధీమా

Political Disputes in Station Ghanpur : అధికార పార్టీ బీఆర్​ఎస్​లో(BRS) మాటల కత్తులు దూసుకుంటున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. మరోసారి రాజకీయవేడీ రాజేశారు. కొన్ని నెలల క్రితమే కడియం శ్రీహరిపై.. రాజయ్య అవినీతి ఆరోపణలు చేయడం దీనికి తిరిగి కడియం ధీటుగా బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో పరిస్థితి మరింత ముదరకుండా రంగంలోకి దిగిన బీఆర్​ఎస్​ అధిష్ఠానం.. ఇరువురి నేతలకు సర్ధిచెప్పింది. దీంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఇద్దరు నేతలు.. మరోసారి మాటలకు పనిచెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్​ఎస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభిస్తే ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Tatikonda Rajaiah vs Kadiyam Srihari : రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించిన కేసీఆర్(KCR).. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో, ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదో అక్కడ మార్పులు చేర్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల జాబితాలో స్టేషన్​ ఘన్​పూర్​ కూడా ఉందని తెలిపారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మార్పు జరిగితే ఆ మార్పు ద్వారా తనకు అవకాశం లభిస్తే.. ప్రజలు గెలిపించాలని, నిజాయతీగా పనిచేస్తానని కడియం వ్యాఖ్యానించారు.

కడియం శ్రీహరి వ్యాఖ్యలకు రాజయ్య కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. ఏ సర్వేలు చేసినా నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో మార్పు ఉండబోదని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనవైపే ప్రజాబలం ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. అర్హత లేకుండా కొందరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించడం సరికాదని తెలిపారు

బీఆర్​ఎస్​ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొందరి మార్పు తథ్యమనే ప్రచారం నడుమ.. మరోసారి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇప్పటికే ఒకసారి సర్దిచెప్పిన గులాబీపార్టీ పెద్దలు.. ఎన్నికల ముంగిట ఎలాంటి రాజీమంత్రాన్ని అవలంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

"సీఎం కేసీఆర్​ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల జాబితాలో.. స్టేషన్​ ఘన్​పూర్​ కూడా ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మార్పు జరిగితే.. ఆ మార్పు ద్వారా నాకు అవకాశం లభిస్తే ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నిజాయతీగా పనిచేస్తాను". - కడియం శ్రీహరి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ

"స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికలో ఎటువంటి మార్పు ఉండదు. కేసీఆర్​ నియమ నిబంధనలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధిని చేశాను. ఎమ్మెల్యే అభ్యర్ధిగా కేసీఆర్ ఎంపిక, ప్రజాబలం నా వైపే ఉంది. అర్హత లేకుండా కొందరు టికెట్​ అశించడం సరికాదు". - తాటికొండ రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

Disputes in Warangal BRS Leaders : గులాబీవనంలో గుబులు.. సొంత పార్టీ నేతల మధ్య లోపించిన సఖ్యత

Kadiyam Srihari fires at Station Ghanpur : 'స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పెరిగిన అవినీతి.. బండి సంజయ్ ఉత్తరకుమారుడే'

Station Ghanpur assembly constituency issue స్టేషన్​ఘన్​పూర్​లో రాజుకున్న రాజకీయవేడి.. టికెట్​పై ఎవరికి వారు ధీమా

Political Disputes in Station Ghanpur : అధికార పార్టీ బీఆర్​ఎస్​లో(BRS) మాటల కత్తులు దూసుకుంటున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. మరోసారి రాజకీయవేడీ రాజేశారు. కొన్ని నెలల క్రితమే కడియం శ్రీహరిపై.. రాజయ్య అవినీతి ఆరోపణలు చేయడం దీనికి తిరిగి కడియం ధీటుగా బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో పరిస్థితి మరింత ముదరకుండా రంగంలోకి దిగిన బీఆర్​ఎస్​ అధిష్ఠానం.. ఇరువురి నేతలకు సర్ధిచెప్పింది. దీంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఇద్దరు నేతలు.. మరోసారి మాటలకు పనిచెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్​ఎస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభిస్తే ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Tatikonda Rajaiah vs Kadiyam Srihari : రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించిన కేసీఆర్(KCR).. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో, ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదో అక్కడ మార్పులు చేర్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల జాబితాలో స్టేషన్​ ఘన్​పూర్​ కూడా ఉందని తెలిపారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మార్పు జరిగితే ఆ మార్పు ద్వారా తనకు అవకాశం లభిస్తే.. ప్రజలు గెలిపించాలని, నిజాయతీగా పనిచేస్తానని కడియం వ్యాఖ్యానించారు.

కడియం శ్రీహరి వ్యాఖ్యలకు రాజయ్య కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. ఏ సర్వేలు చేసినా నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో మార్పు ఉండబోదని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనవైపే ప్రజాబలం ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. అర్హత లేకుండా కొందరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించడం సరికాదని తెలిపారు

బీఆర్​ఎస్​ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొందరి మార్పు తథ్యమనే ప్రచారం నడుమ.. మరోసారి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇప్పటికే ఒకసారి సర్దిచెప్పిన గులాబీపార్టీ పెద్దలు.. ఎన్నికల ముంగిట ఎలాంటి రాజీమంత్రాన్ని అవలంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

"సీఎం కేసీఆర్​ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల జాబితాలో.. స్టేషన్​ ఘన్​పూర్​ కూడా ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మార్పు జరిగితే.. ఆ మార్పు ద్వారా నాకు అవకాశం లభిస్తే ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నిజాయతీగా పనిచేస్తాను". - కడియం శ్రీహరి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ

"స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికలో ఎటువంటి మార్పు ఉండదు. కేసీఆర్​ నియమ నిబంధనలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధిని చేశాను. ఎమ్మెల్యే అభ్యర్ధిగా కేసీఆర్ ఎంపిక, ప్రజాబలం నా వైపే ఉంది. అర్హత లేకుండా కొందరు టికెట్​ అశించడం సరికాదు". - తాటికొండ రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

Disputes in Warangal BRS Leaders : గులాబీవనంలో గుబులు.. సొంత పార్టీ నేతల మధ్య లోపించిన సఖ్యత

Kadiyam Srihari fires at Station Ghanpur : 'స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పెరిగిన అవినీతి.. బండి సంజయ్ ఉత్తరకుమారుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.