ETV Bharat / state

దేవరుప్పులలో చెరువులను సందర్శించిన ఎర్రబెల్లి - minister errabelli dayakar rao visit fonds

దేవరుప్పుల మండలంలో పలు చెరువులను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సందర్శించారు. ఖరీఫ్​ పూర్తయ్యే సమయానికి మరోసారి చెరువులను నింపేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

దేవరుప్పులలో చెరువులను సందర్శించిన ఎర్రబెల్లి
author img

By

Published : Nov 21, 2019, 10:33 PM IST

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పర్యటించారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న దేవరుప్పుల మండలంలోని చెరువులను మత్తడి పోయిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి అన్నారు. దేవరుప్పులలోని గుడి చెరువుకు ద్విచక్రవాహనంపై చేరుకున్న మంత్రి... కేసీఆర్​ చిత్రపటానికి అభిషేకం చేశారు. ముఖ్యమంత్రి సహకారంతోనే చెరువులను నింపడం సాధ్యమైందన్నారు. ఖరీఫ్​ పంటలు చేతికొచ్చే సమయానికి మరో దఫా చెరువులు నింపేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో తాగు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దేవరుప్పుల చౌరస్తాలో లోపించిన పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ప్రణాళిక స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉన్న దుకాణాల యజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం సింగరాజుపల్లిలోని సింగరాయ చెరువును మంత్రి సందర్శించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను ప్రారంభించారు.

దేవరుప్పులలో చెరువులను సందర్శించిన ఎర్రబెల్లి

ఇదీ చూడండి: కాళ్లు, వెన్నుముక లేకున్నా... బండి నడుపుతూ...

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పర్యటించారు. కరువు పీడిత ప్రాంతంగా ఉన్న దేవరుప్పుల మండలంలోని చెరువులను మత్తడి పోయిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి అన్నారు. దేవరుప్పులలోని గుడి చెరువుకు ద్విచక్రవాహనంపై చేరుకున్న మంత్రి... కేసీఆర్​ చిత్రపటానికి అభిషేకం చేశారు. ముఖ్యమంత్రి సహకారంతోనే చెరువులను నింపడం సాధ్యమైందన్నారు. ఖరీఫ్​ పంటలు చేతికొచ్చే సమయానికి మరో దఫా చెరువులు నింపేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో తాగు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దేవరుప్పుల చౌరస్తాలో లోపించిన పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ప్రణాళిక స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉన్న దుకాణాల యజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం సింగరాజుపల్లిలోని సింగరాయ చెరువును మంత్రి సందర్శించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను ప్రారంభించారు.

దేవరుప్పులలో చెరువులను సందర్శించిన ఎర్రబెల్లి

ఇదీ చూడండి: కాళ్లు, వెన్నుముక లేకున్నా... బండి నడుపుతూ...

Intro:Tg_wgl_62_minister_errabelli_visit_ab_ts10070
Nitheesh, janagama, 8878753177
కరువు పీడిత ప్రాంతంగా ఉన్న దేవరుప్పుల మండలంలోని చెరువులను మత్తడి పోయిస్తానని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలకేంద్రంలోని గుడిచెరువు నుంచి మత్తడి పోస్తున్న గోదావరి జలాలకు ద్విచక్రవాహనంపై చేరుకున్న మంత్రి దయాకర్‌రావు పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాబిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహకారంతోనే చెరువులను నింపడం సాధ్యపడిందన్నారు. నియోజకవర్గంలోని రైతులు సంతోషంగా పంటలు పండించుకోవడానికి కృషిచేస్తానని హామీ
ఇచ్చారు. ఖరీప్ పంటలు చేతికోచ్చే సమయంలో మరో ధపా చెరువులు నింపేలా కృషిచేస్తానన్నారు. తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. దేవరుప్పుల మండలంలోని ఇటీవల నిర్మించిన నాలుగు చెక్ డ్యామ్ లు, చెరువులు పూర్తిస్తాయిలో నిండటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను సస్యశ్యామలంగా అభివృద్ధి
చెందించడానికి బాధ్యత తీసుకుంటానన్నారు. ఇంకా నిండని చెరువులను త్వరలోనే నింపుతామన్నారు. 30 రోజుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పనులను నిరంతరం కొనసాగించాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా
ఉంచుకుంటూ మిగతావారికి ఆదర్శంగా ఉండాలన్నారు. అనంతరం సింగరాజుపల్లిలోని సింగరాయ చెరువును మంత్రి సందర్శించారు. చెరువులోని నీటికి పూజలు చేశారు. సింగరాలు పల్లిలో నూతనంగ ఏర్పాటు చేసని విద్యుత్తు వీధి దీపాలను మంత్రి ప్రారంభించారు. దేవరుప్పుల ప్రదాన చౌరస్తాలో లోపించిన పారిశుద్ధ్యంపై
మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న దుకాణాలను సందర్శించి పరిశుభ్రతను పాటించాలని, లేనిచో భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. పారిశుద్ధ్యంపై
నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.