ETV Bharat / state

లోటు వర్షపాతం.. అన్నదాతకు కష్టం... - లోటు వర్షపాతం

లోటు వర్షపాతం అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీజన్​ ప్రారంభమై 50 రోజులు దాటినా జనగామ జిల్లాలో ఇప్పటి వరకూ 20 శాతం వరినాట్లు కూడా పడలేదు. ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

లోటు వర్షపాతం
author img

By

Published : Jul 24, 2019, 11:04 AM IST

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగుపై కరవు దాడి చేస్తోంది. జనగామ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. సీజన్‌ ప్రారంభమై 50 రోజులు దాటినా... ఇప్పటి వరకు 20 శాతం కూడా వరినాట్లు పడలేదు. ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు చేతికి వచ్చే అవకాశం ఉండదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావం నెలకొంది. జిల్లాలో సగటు వర్షపాతం 293.8 మిల్లీమీటర్లు కాగా... 179.9 మిల్లీమీటర్లు కురిసింది. ఇంకా 39.0 శాతం లోటు ఉంది. చిల్పూరులో 77.3 శాతం, కొడకండ్లలో 71.6, బచ్చన్నపేటలో 55.9, లింగాలఘనపురంలో 51.2, జనగామలో 48.6, నర్మెట్టలో 49.1, తరిగొప్పులలో 36.1 శాతం లోటు కనిపిస్తోంది. చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి.

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగుపై కరవు దాడి చేస్తోంది. జనగామ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. సీజన్‌ ప్రారంభమై 50 రోజులు దాటినా... ఇప్పటి వరకు 20 శాతం కూడా వరినాట్లు పడలేదు. ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు చేతికి వచ్చే అవకాశం ఉండదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావం నెలకొంది. జిల్లాలో సగటు వర్షపాతం 293.8 మిల్లీమీటర్లు కాగా... 179.9 మిల్లీమీటర్లు కురిసింది. ఇంకా 39.0 శాతం లోటు ఉంది. చిల్పూరులో 77.3 శాతం, కొడకండ్లలో 71.6, బచ్చన్నపేటలో 55.9, లింగాలఘనపురంలో 51.2, జనగామలో 48.6, నర్మెట్టలో 49.1, తరిగొప్పులలో 36.1 శాతం లోటు కనిపిస్తోంది. చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి.

ఇదీ చూడండి : నిర్మాణ పనుల్లో నిబంధనలు తూచ్‌..!

Intro:TG_NLG_111_21_Venatduthunna_Gadulakoratha_Pkg_TS10102

మునుగోడు లోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో సరిపడ తరగతి గదులు లేక విద్యార్థులు అవస్థలతో కాలం వెళ్లదీస్తున్నారు. వారిని చూసి అధికారులు మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు అదనపు తరగతి గదులు, కస్తూర్బా విద్యాలయానికి నూతన భవనం కోసం నిధులు మంజూరు చేసి టెండలను సైతం పిలిచారు. కానీ పనులను ప్రారంభించేందుకు గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండడంతో నేటికి ప్రారంభం కాలేదు. ఈ నెల 8న మండల జెడ్ పి అధ్యక్షులు ఎన్నికలతో కోడ్ ముగిసినప్పటికి నేటికి ప్రారంభం కాకపోవడంతో పనులు ప్రారంభం కావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో 2019 20 విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

*టెండర్లు పూర్తి నెలలు*
మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న 20 తరగతి గదుల్లో 15 గదులు పూర్తి శిథిలావస్థకు చేరాయి.5 తరగతి గదులు మాత్రం కొంతమేర బాగున్నాయి .అదనపు తరగతి గదులను ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధుల నుంచి 68 లక్షల ను గత ఏడాది సెప్టెంబర్ 3న నిధులు మంజూరు చేశారు. దీంతో పాటు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ నిధుల నుంచి మరో 72 లక్షలు రూపాయల నిధులు మంజూరు కావడంతో గత ఏడాది డిసెంబర్లో టెండర్లు నిర్వహించారు .సుమారు 14 గదులను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. స్థానిక కస్తూర్బా గాంధీ కళాశాల భవనం ఏర్పాటు గత ఏడాది అక్టోబర్ మాసంలో సర్వ శిక్ష అభియాన్ నిధుల నుంచి ఒక 1.35కోట్ల నిధులు మంజూరు అయ్యాయి .దీంతో టెండర్లు సైతం పూర్తిచేశారు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన పనులను ప్రారంభించలేక పోయామాని అధికారులు చెబుతున్నారు.

ఇబ్బందులు పడాల్సిందే నా

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాలావరకు తరగతి గదులు పూర్తి స్థితిలో శిథిలదశకు చేరుకున్నాయి. చిన్నపాటి వర్షం కురిసిన గోడల పైకప్పు నుంచి నీరు మట్టి తో కలిసి రాలుతుంది పైనుంచి పడుతున్న నీళ్ళ తో మట్టి పెడ్డలతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇన్నాళ్లు ఎలా గోలా కొనసాగిన ప్రస్తుతం మరింత శిథిలమయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే కూలే దశలో ఉన్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. ఇది ఇలా ఉంటే స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గతేడాది ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు ఉన్న భవనంలోనే ఇంటర్మీడియట్ తరగతి గదులు కొనసాగించారు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఇప్పుడు ద్వితీయసంవత్సరం లోకి ప్రవేశించారు మళ్లీ ప్రథమ సంవత్సరం లో కొత్తగా విద్యార్థులను చేర్చుకోవడానికి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులు ఆదేశించడంతో చేర్చుకున్నారు .విద్యార్థుల సంఖ్య గతం కంటే రెట్టింపు కావడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆయా పాఠశాలకు తరగతి గదులు తోపాటు భోజనాలు చేసే గది చిన్నదిగా ఉండడంతో విద్యార్థులు భోజన సమయంలో చెట్టుకింద బోజనాలు చేస్తున్నారు వర్షాకాలం అయితే అదే చిన్న ఇరుకు గదిలో భోజనాలు చేయాలంటే మరి ఇరుకుకుగా ఉంటుందని విశ్రాంతి గదులు సైతం తక్కువ గా ఉండడంతో రాత్రి పూట క్లాస్ రూమ్ లలో నిద్రించాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు కూడా తగినన్ని లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని ఈ విషయాన్ని జిల్లా అధికారులు గుర్తించి పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు .


Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా



Conclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.