జగిత్యాలలో ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి వీధిపాలు చేసింది. జిల్లాకేంద్రంలోని గణేశ్నగర్లో ద్యావనపల్లి రమేశ్ దంపతులు ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకింది. ఈ విషయం తెలిసిన ఇంటి యాజమాని వారిని నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించాడు. కట్టుబట్టలతో బయటకు వెళ్లిన వారు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై ఉండాల్సి వచ్చింది.
సమాచారం అందుకున్న అధికారులు వారిని 108 వాహనంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయించటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యామని బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది : హర్షవర్ధన్