ETV Bharat / state

జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో స్వచ్ఛంద లాక్​డౌన్​

author img

By

Published : Apr 22, 2021, 4:39 PM IST

కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతున్నందున జగిత్యాల జిల్లాలోని పలు పురపాలక సంఘాల పాలకవర్గాలు... లాక్​డౌన్​ పాటించేందుకు తీర్మానం చేశాయి. స్వచ్ఛంద లాక్​డౌన్​ వల్ల రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

jagtial lockdown
telangana news

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్ మండలాలతో పాటు పలు పురపాలక సంఘాల పాలకవర్గాలు లాక్​డౌన్ అమలు చేసేందుకు తీర్మానాలు చేశాయి. పల్లెల్లో కొవిడ్​ పాజిటివ్​ కేసులు భారీగా పెరుగుతున్నందున ముందస్తు చర్యలుగా లాక్​డౌన్​ విధానం పాటిస్తున్నారు.

గ్రామాల్లో రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దుకాణాలు మధ్యాహ్నం వరకు తెరిచి ఉంచినప్పటికీ జన సంచారం అంతంతమాత్రంగానే ఉంది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికొచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్ మండలాలతో పాటు పలు పురపాలక సంఘాల పాలకవర్గాలు లాక్​డౌన్ అమలు చేసేందుకు తీర్మానాలు చేశాయి. పల్లెల్లో కొవిడ్​ పాజిటివ్​ కేసులు భారీగా పెరుగుతున్నందున ముందస్తు చర్యలుగా లాక్​డౌన్​ విధానం పాటిస్తున్నారు.

గ్రామాల్లో రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దుకాణాలు మధ్యాహ్నం వరకు తెరిచి ఉంచినప్పటికీ జన సంచారం అంతంతమాత్రంగానే ఉంది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికొచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్​ కొరతను అధిగమిస్తాం: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.