జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పట్టణ, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. నిందితులు జగిత్యాలకు చెందిన ఇనయత్ అలీ, మహమ్మద్ రజాక్, షేక్ అబ్దుల్గా ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు