ETV Bharat / state

కొండగట్టులో నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి - తెలంగాణ వార్తలు

కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాండబరంగా జరిపారు. మూల విరాట్​కు నూతన వస్త్రాలు సమర్పించి.. అభిషేకాలు నిర్వహించారు. కరోనా దృష్ట్యా భక్తులను దేవస్థానంలోకి అనుమతించలేదు.

Hanuman Jayanti celebrations,  kondagattu temple
హనుమ జయంతి 2021, కొండగట్టు ఆలయం
author img

By

Published : Apr 27, 2021, 2:13 PM IST

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా లక్షలాది మంది భక్తుల నడుమ జరిగే ఈ వేడుకలు... కరోనా కారణంగా ఆలయంలో సాదాసీదాగా జరిగాయి. మూలవిరాట్​కు పట్టు వస్త్రాలు సమర్పించి... ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

ఆలయంలోకి అనుమతి లేకపోవడం వల్ల భక్తులు, హనుమాన్‌ దీక్షాస్వాములు దేవస్థానం పరిసరాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు ఆలయంలోకి రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30 వరకు ఆలయం మూసి ఉంటుందని ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు.

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా లక్షలాది మంది భక్తుల నడుమ జరిగే ఈ వేడుకలు... కరోనా కారణంగా ఆలయంలో సాదాసీదాగా జరిగాయి. మూలవిరాట్​కు పట్టు వస్త్రాలు సమర్పించి... ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

ఆలయంలోకి అనుమతి లేకపోవడం వల్ల భక్తులు, హనుమాన్‌ దీక్షాస్వాములు దేవస్థానం పరిసరాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు ఆలయంలోకి రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30 వరకు ఆలయం మూసి ఉంటుందని ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: మెట్​పల్లి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.