ETV Bharat / state

కొండగట్టులో నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి

author img

By

Published : Apr 27, 2021, 2:13 PM IST

కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాండబరంగా జరిపారు. మూల విరాట్​కు నూతన వస్త్రాలు సమర్పించి.. అభిషేకాలు నిర్వహించారు. కరోనా దృష్ట్యా భక్తులను దేవస్థానంలోకి అనుమతించలేదు.

Hanuman Jayanti celebrations,  kondagattu temple
హనుమ జయంతి 2021, కొండగట్టు ఆలయం

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా లక్షలాది మంది భక్తుల నడుమ జరిగే ఈ వేడుకలు... కరోనా కారణంగా ఆలయంలో సాదాసీదాగా జరిగాయి. మూలవిరాట్​కు పట్టు వస్త్రాలు సమర్పించి... ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

ఆలయంలోకి అనుమతి లేకపోవడం వల్ల భక్తులు, హనుమాన్‌ దీక్షాస్వాములు దేవస్థానం పరిసరాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు ఆలయంలోకి రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30 వరకు ఆలయం మూసి ఉంటుందని ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు.

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా లక్షలాది మంది భక్తుల నడుమ జరిగే ఈ వేడుకలు... కరోనా కారణంగా ఆలయంలో సాదాసీదాగా జరిగాయి. మూలవిరాట్​కు పట్టు వస్త్రాలు సమర్పించి... ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

ఆలయంలోకి అనుమతి లేకపోవడం వల్ల భక్తులు, హనుమాన్‌ దీక్షాస్వాములు దేవస్థానం పరిసరాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు ఆలయంలోకి రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30 వరకు ఆలయం మూసి ఉంటుందని ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: మెట్​పల్లి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.