ETV Bharat / state

విజృంభిస్తోన్న కరోనా.. భయాందోళనలో జిల్లా ప్రజలు

author img

By

Published : Apr 21, 2021, 11:30 AM IST

జగిత్యాల జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా వందలాది కొవిడ్​ కేసులు... పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే ఏకంగా 17 మంది వైరస్​తో మరణిచంగా... మంగళవారం 11 మంది మృతి చెందారు.

daily increasing corona cases in Jagtial district
జగిత్యాల జిల్లాలో పెరిగిపోతున్న కరోనా కేసులు

కరోనా.. ఈ పేరు వింటేనే జగిత్యాల జిల్లా ప్రజలు భయందోళనతో వణికిపోతున్నారు. మహమ్మారి ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తోంది. పది రోజులుగా జిల్లావ్యాప్తంగా వందలాది కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చాల మంది వైరస్​ బాధితులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఒకే కుంటుంబంలో ముగ్గురు...

జగిత్యాల పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన దొంతుల రాంచంద్రం కుటుంబంలో కరోనా పెను విషాదాన్ని మిగిల్చింది. వారి ఇంట్లో అందరికి కరోనా రాగా ముందుగా పెద్ద కొడుకు సునీల్‌ మృతి చెందాడు. ఆ తర్వాత రాంచంద్రం... ఆయన తరువాత చిన్న కొడుకు మరణించాడు. ఇలా వారం వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు పోచమ్మవాడకు చెందిన గౌతమి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.

11 మంది మృతి...

ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ మరణాలు నమోదువుతండగా.. వందల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం 11 మంది మృతి చెందారు. జిల్లాలోని ఆస్పత్రుల్ని కరోనా రోగులతో నిండిపోగా... ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఇదీ చదవండి: కరోనా పంజా: రాష్ట్రంలో మరో 6,542 కొవిడ్ కేసులు

కరోనా.. ఈ పేరు వింటేనే జగిత్యాల జిల్లా ప్రజలు భయందోళనతో వణికిపోతున్నారు. మహమ్మారి ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తోంది. పది రోజులుగా జిల్లావ్యాప్తంగా వందలాది కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చాల మంది వైరస్​ బాధితులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఒకే కుంటుంబంలో ముగ్గురు...

జగిత్యాల పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన దొంతుల రాంచంద్రం కుటుంబంలో కరోనా పెను విషాదాన్ని మిగిల్చింది. వారి ఇంట్లో అందరికి కరోనా రాగా ముందుగా పెద్ద కొడుకు సునీల్‌ మృతి చెందాడు. ఆ తర్వాత రాంచంద్రం... ఆయన తరువాత చిన్న కొడుకు మరణించాడు. ఇలా వారం వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరోవైపు పోచమ్మవాడకు చెందిన గౌతమి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.

11 మంది మృతి...

ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ మరణాలు నమోదువుతండగా.. వందల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం 11 మంది మృతి చెందారు. జిల్లాలోని ఆస్పత్రుల్ని కరోనా రోగులతో నిండిపోగా... ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఇదీ చదవండి: కరోనా పంజా: రాష్ట్రంలో మరో 6,542 కొవిడ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.