జగిత్యాల కూరగాయల మార్కెట్ను జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ పరిశీలిచారు. మార్కెట్లో సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మార్కెట్లో పారిశుద్ధ్యం లోపించినందున మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుకాలువలు అపరిశుభ్రంగా ఉండటం చూసి దగ్గరుండి వాటిని శుభ్రం చేయించారు. నిర్మాణంలో ఉన్న షెడ్డును త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణం