ETV Bharat / state

cm kcr: ఎమ్మెల్యే బాల్క సుమన్​ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి - telangana varthalu

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ తండ్రి బాల్క సురేశ్​ సంస్మరణ సభలో సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. సురేశ్​ చిత్రపటానికి నివాళులర్పించి... బాల్క సుమన్​ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

kcr
ఎమ్మెల్యే బాల్క సుమన్​ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి
author img

By

Published : Jun 9, 2021, 6:35 PM IST

Updated : Jun 9, 2021, 7:07 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ను పరామర్శించారు. బాల్క సురేశ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్​ హైదరాబాద్​ నుంచి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రేగుంట రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. సురేశ్​ చిత్రపటానికి నివాళులర్పించి బాల్క సుమన్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తండ్రి, మెట్​పల్లి మాజీ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ సురేష్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్​, ఎంపీ వెంకటేశ్​ నేత, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్​ బయలుదేరారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్​ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి

సురేందర్​ రెడ్డి విగ్రహానికి నివాళులు

అనంతరం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్మూర్​లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంట ఉన్నారు.

ఇదీ చదవండి: YS Sharmila:ఈటల.. పార్టీలో చేరతానంటే స్వాగతిస్తా: వైఎస్​ షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ను పరామర్శించారు. బాల్క సురేశ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్​ హైదరాబాద్​ నుంచి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రేగుంట రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. సురేశ్​ చిత్రపటానికి నివాళులర్పించి బాల్క సుమన్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తండ్రి, మెట్​పల్లి మాజీ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ సురేష్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్​, ఎంపీ వెంకటేశ్​ నేత, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్​ బయలుదేరారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్​ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి

సురేందర్​ రెడ్డి విగ్రహానికి నివాళులు

అనంతరం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్మూర్​లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంట ఉన్నారు.

ఇదీ చదవండి: YS Sharmila:ఈటల.. పార్టీలో చేరతానంటే స్వాగతిస్తా: వైఎస్​ షర్మిల

Last Updated : Jun 9, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.